ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 15 నవంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని రామక్రిష్ణ P.G కళాశాల మీటింగ్ హాల్ నందు కర్నూలు ,నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసు అదికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సరళాదేవి ఆద్వర్యంలో నిర్వహించారు..

ఈసందర్బంగా క్రిమినల్ కేసులలో పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ సుదీర్ఘంగా జరిగింది. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు సదరు వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు కోర్టులో హాజరుపరచుటకు ముందు పోలీస్ అధికారులు నిర్వహించవలసిన విధివిధానాల గురించి కోర్టు వారు వివరించారు..దర్యాప్తు అధికారి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాలని కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని వివరించారు..ఈ కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ C సరళాదేవి తోపాటు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి, డోన్ డిఎస్పి శ్రీనివాస్ ,సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు మరియు మహేశ్వరి , అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోతీలాల్ , స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు C.V శ్రీనివాసులు , Y. శ్రీహరి,నంద్యాల మూడవ ADJ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగ రాజశేఖర్ రెడ్డి , ఆళ్లగడ్డ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాదరావు ,కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు నంద్యాల జిల్లా పోలీసు అదికారులు పాల్గొన్నారు.