♦ ప్రభాకర్ చౌదరి ప్రజాటివి ప్రతినిది



నంద్యాల,డిశెంబరు 20( ప్రజా డిజిటల్ న్యూస్) .
సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు.
ఈసందర్బంగా జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు ,ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 9 మంది పోలీసు సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని భరోసా కల్పించారు. ఈసందర్బంగా ఎస్ పి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలియజేసుకోవచ్చని తెలిపారు. విధినిర్వహణలో సిబ్బంది సతమత పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చెయ్యటమే కార్యక్రమ లక్ష్యమని ఎస్ పి తెలిపారు..