ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
హైదరాబాద్, మార్చి 22(ప్రజాన్యూస్) :- ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్లో శనివారం సీఎం చంద్రబాబు ఫరూక్ ఇంటికెళ్లారు. ఇటీవల ఫరూక్ సతీమణి షెహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఫరూక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.