మంత్రి ఫరూక్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

హైదరాబాద్, మార్చి 22(ప్రజాన్యూస్) :- ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లో శనివారం సీఎం చంద్రబాబు ఫరూక్ ఇంటికెళ్లారు. ఇటీవల ఫరూక్ సతీమణి షెహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఫరూక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *