ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 20 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాలపట్టణంలోని శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో శనివారం “మెప్మా – నిపుణ మెగా జాబ్ మేళా” ను ఘనంగా నిర్వహించారు . నిపుణ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపి రాష్ట్ర యువ నాయకులు ఎన్.ఎం.డి. ఫయాజ్, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, మెప్మా పీడీ వెంకట దాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ “ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని వదులుకోకూడదని . నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరియు మెప్మా కలిసి ఒకే వేదికపైకి ఇన్ని బహుళజాతి కంపెనీలను తీసుకురావడం అభినందనీయని . యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలన్నారు”. “కేవలం డిగ్రీ పట్టాలు ఉంటే సరిపోదని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను (స్కిల్స్) మెరుగుపరుచుకోవాలన్నార. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారికే కార్పొరేట్ రంగంలో మంచి గుర్తింపు లభిస్తుందని . స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడమే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి విద్యార్థి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని . ఈరోజు చిన్న ఉద్యోగంలో చేరినప్పటికీ, నిరంతర కృషి, పట్టుదలతో పని చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు. యువత తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మెప్మా మరియు నిపుణ సంస్థల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించిన యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాల వేదికగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదువుకున్న ప్రతి యువకుడికి, యువతికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లభించాలనేది మా ఆశయమని అందుకే విద్యార్థుల ముంగిటకే ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో మెప్మా మరియు నిపుణ సంస్థలతో కలిసి ఈ ‘మెగా జాబ్ మేళా’ను ఏర్పాటు చేశామన్నారు . నంద్యాల జిల్లాలోని యువతలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని. సరైన వేదిక దొరికితే వారు ప్రపంచ స్థాయిలో రాణించగలరన్నారు . ఇంటర్వ్యూలలో పాల్గొనే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని . ఒక్కసారి అవకాశం రాకపోయినా నిరాశ చెందకుండా, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలన్నారు . రామకృష్ణ విద్యాసంస్థలు కేవలం నాణ్యమైన విద్యకే కాకుండా, విద్యార్థుల కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఎప్పుడూ ముందుంటాయన్నారు మెప్మా పీడీ వెంకట దాస్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రైవేట్ రంగంలో మంచి అవకాశాలు కల్పించేందుకు మెప్మా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ మేళాలో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ జియో, పేటీఎం, మెడ్ప్లస్, జస్ట్డయల్, అమర రాజా, NIIT, సువిధా స్టాఫింగ్ సొల్యూషన్స్ వంటి దాదాపు 15 కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.ఈ కార్యక్రమంలో నిపుణ ప్రతినిధులు, కళాశాల అధ్యాపక బృందం , టిడిపి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.