నంద్యాలజిల్లా గోస్పాడు వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, ఆగస్టు 16 (ప్రజాన్యూస్) ::

శ్రీకృష్ణాష్టమి సందర్బముగా నంద్యాల జల్లా గోసుపాడు లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి…

ఈసందర్బంగా వేణుగోపాలస్వామి ఆలయాన్ని పూలతో మరియూ విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు..వుదయము నుండి అభిషేకము ,పూజా కార్యక్రమం లు జరిగాయి…అర్చకులు లక్ష్మీనారాయణ వేణుగోపాలస్వామికి పూజ కార్యక్రమములు నిర్వహించారు..రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు…ఆలయనిర్వాహకులు ముక్కమళ్ల వేణుగోపాల్ రెడ్డి, న్యాయవాది వివేకానంద రెడ్డి అధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి ఇంటిదగ్గర సాయంకాలము 7.30 నుండి గ్రామస్తులందరికి అన్నప్రసాద కార్యక్రమము ఏర్పటు చేశారు..కార్యక్రమంలో గ్రామస్థులు,భజనబృందాలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *