అన్నదాతసుఖీభవ..రైతుల పాలిట వరం..మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి హరిబాబు

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

నంద్యాల,2 ఆగస్టు 2025(ప్రజాన్యూస్)

అన్నదాత సుఖీభవ పదకం రైతుల పాలిట వరమని నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పేర్కొన్నారు..నంద్యాల మండలం కానాల గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో న్యాయ మరియు మైనారిటి శాఖా మంత్రి ఎన్ ఎండి  ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి ,నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారు పాల్గొని రైతులకు మొదటి విడత చెక్కుల పంపిణీ చేశారు..అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పదకాలలో మరో పదకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి రైతుల గుండెల్లో నిలిచిపోయారన్నారు..ఆగస్ఘు 15 న శ్రీ శక్తి హామీలో భాగంగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారన్నారు..ఓవైైపు హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర అబివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *