ఆళ్లగడ్డలో నూతన సంవత్సర వేడుకలలో.హద్దు దాటితే కటిన చర్యలు తప్పవు. డిఎస్ పి ప్రమోద్

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి

నంద్యాల,31 డిశెంబరు 2025(ప్రజాన్యూస్)

ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి ప్రమోద్ సూచించారు.

గురువారం డిఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రోడ్లపై బాణసంచా కాల్చడం, రోడ్లపై కేకు కటింగులు చేయడం ,అధిక శబ్దాలతో లౌడ్ స్పీకర్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు… మహిళల రక్షణ కోసం రద్దీ ప్రదేశాలలో మఫ్టీ పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని అన్నారు. నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *