నరహరి విశ్వం కు కేంద్రం లో కీలక పదవి

ప్రజాటివి ప్రతినిది ప్రబాకర్  చౌదరి

నంద్యాల,11 మే 2025(ప్రజాన్యూస్)

ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున నంద్యాల అసెంబ్లీ ఎన్నికల లో విజయం కోసం పని చేసిన టీడీపీ యువ నేత నరహరి విశ్వనాథ రెడ్డి కి కేంద్రం లో కీలకమైన ఫుడ్ కార్పొరేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి మెంబర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది…శని వారం చేసిన ఉత్తర్వులు లలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ సిఫార్సు మేరకు ఈ కీలకమైన పదవి లభించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.. విశ్వ నాథ రెడ్డి తెలుగు దేశం లో వివిధ పదవులు తో పాటు నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా పని చేశారు.. గత ఎన్నికలలో ఫరూక్,బైరెడ్డి శబరీ విజయం కోసం బారీగా కృషి చేశారు..ప్రస్తుతం ex MLA బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయుడు గా నంద్యాల పార్లమెంట్ బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నారు..విశ్వం కు పదవి రావడం లో కృషి చేసిన బైరెడ్డి శబరమ్మ గారికి అయిన అనుచరులు కృతజ్ఞతలు తెలిపారు..విశ్వం విలేకరులతో మాట్లాడుతూ ఎంపి బైరెడ్డి శబరమ్మ గారికి,బైరెడ్డి రాజా శేఖర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలుపు తున్ననాని అన్నారు..నాకు లభించిన పదవి కి న్యాయం చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *