ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, పిబ్రవరి 6 2026(ప్రజాన్యూస్) :
మహా శివరాత్రి సందర్బంగా ప్రముఖపుణ్యక్షేత్రమైన మహానందిలో ఈనెల 16 నుండి 18 వరకు అఖిల భారత ఓంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం బహుమతి ప్రదాత టిడిపి నేత మాలపాటి పుల్లయ్య చౌదరి తెలిపారు..

ఈసందర్బంగా పుల్లయ్య చౌదరి మాట్లాడుతూ మహనంది టిడిపి రైతుకమిటి ఆద్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారని యం యస్ కౌరా ఇన్ ప్రా ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో తాను బహుమతులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు..సీనియర్స్ ఎడ్డ ప్రదర్శనలో గెలుపొందిన ఆరుగురుకి బహుమతులు మొత్తం రూ.4లక్షల 55వేలు,,,17 వతేది ఆరు బహుమతులకు 2లక్షల 75 వేలు, 18వతేది ఆరుపళ్ల విభాగం లో ఆరు బహుమతులకు గారు రూ.1లక్ష 57 వేల రూపాయలు యంయస్ కౌరా ఇన్ ప్రా ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో తాను అందిస్తున్నట్లు మాలపాటి పుల్లయ్య చౌదరి తెలిపారు..వివరాలకు తనను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు..